Tirumala : ఏడు కొండల సామీ ఎక్కడున్నావయ్యా? కానరేవేమయ్యా?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది.

Update: 2024-05-30 03:41 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. వసతి గదు కోసం గంటల తరబడి భక్తులు ఎదురు చూస్తున్నారు. పద్మావతి విచారణ కౌంటర్ దగ్గరకు వసతి గృహాల కోసం భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. వీఐపీ సిఫార్సు ఉన్న వారికి కూడా వసతి గృహాలు దొరకడం కష్టంగా మారింది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

పెరిగిన రద్దీ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూలైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 31 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 73,811 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 34,901 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.19 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News