Tirumala : తొలి ఏకాదశినాడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందో చూశారా?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈరోజు బుధవారం అయినా భక్తుల రద్దీ కొంత ఎక్కువగానే ఉంది.

Update: 2024-07-17 03:11 GMT

arjita seva tickets, devotees, online, tirumala

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈరోజు బుధవారం అయినా భక్తుల రద్దీ కొంత ఎక్కువగానే ఉంది. తొలి ఏకాదశి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని భావించిన అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. అయితే తొలి ఏకాదశికి ఊహించిన స్థాయిలో మాత్రం భక్తులు లేరు. స్వామి వారి దర్శనం త్వరగానే పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

పది కంపార్ట్‌మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పది కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఈరోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది నుంచి పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 71,409 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 26,128 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.15 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News