Breaking : తిరుమల లడ్డూ వ్యవహారం.. సిట్ చీఫ్ గా ఆయనే

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యిపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది.

Update: 2024-09-24 12:13 GMT

Tirumalaladdu

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యిపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది. ఈ సిట్ కు చీఫ్ గా సర్వశ్రేష్ట త్రిపాఠిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొద్దిసేపటి క్రితం డీజీపీతో సమావేశమైన చంద్రబాబు తిరుమల లడ్డూ వివాదంపై చర్చించారు. మంచి అధికారికి సిట్ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించారు.

అనేక పేర్లను పరిశీలించి...
పలువురిపేర్లను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం చివరకు ఐపీఎస్ అధికారి సర్వశ్రేష్ట త్రిపాఠీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుమలకు కల్తీ నెయ్యి ఎలా సరఫరా అయింది? దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు విడుదల కావాల్సి ఉంది. స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.


Tags:    

Similar News