Bengaluru Cake: బెంగళూరులో కేక్ తిని 5 ఏళ్ల బాలుడు మృతి

బెంగళూరులో కేక్ తిన్న 5 ఏళ్ల బాలుడు మరణించిన;

Update: 2024-10-08 16:04 GMT
Bengaluru Cake: బెంగళూరులో కేక్ తిని 5 ఏళ్ల బాలుడు మృతి
  • whatsapp icon

బెంగళూరులో కేక్ తిన్న 5 ఏళ్ల బాలుడు మరణించిన ఘటన కలకలం రేపుతోంది. ఫుడ్ పాయిజన్ కారణంగా 5 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోగా, కేక్ తిన్న అతని తల్లిదండ్రుల పరిస్థితి విషమంగా ఉంది. కెంపేగౌడ ఆస్పత్రిలో బాలుడి తల్లిదండ్రులిద్దరూ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. బాలుడి తండ్రి, బాలరాజు, స్విగ్గీ డెలివరీ వ్యక్తిగా పనిచేస్తున్నాడు. అతని తల్లి నాగలక్ష్మి గృహిణి. తల్లిదండ్రులు ఎక్స్ పైరీ సమయం దాటిన ఆహారం తీసుకోవడంతో ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యారని ప్రాథమిక విచారణలో తేలింది. కుటుంబ సభ్యులు తిన్న ఆహార పదార్థాలన్నింటినీ అధికారులు సేకరించి పరీక్షలకు పంపారు. అధికారులు మరింత సమాచారం కోసం వేచి ఉన్నారు.

కర్ణాటక రాజధాని నగరంలో ఇటీవల కేక్‌లలో హానికరమైన కలరింగ్ ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించిన తర్వాత ఈ సంఘటన జరిగింది. క్యాన్సర్‌తో సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయని పరిశోధనల్లో తేలింది. కొన్నింటిలో ఆరోగ్యానికి హాని కలిగించే క్యాన్సర్ కారకాలు ఉన్నాయని తేలిందని కర్ణాటక మంత్రి కూడా తెలిపారు.


Tags:    

Similar News