పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి

Update: 2022-02-08 01:25 GMT

బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ పై ఆధారపడి పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. తగ్గేది తక్కువ. పెరిగేది ఎక్కువగా ఉంటుంది. అందుకే బంగారం కొనుగోలు చేసేవారు ధర ఎక్కువగా, తక్కువగా ఉందన్నది చూడరు. ఎప్పటికైనా ధర పెరిగే వస్తువు బంగారమే. ఎందుకంటే దానికి అంత డిమాండ్ ఉంది. ముఖ్యంగా భారత్ వంటి దేశంలో బంగారం అంటే మక్కువ ఎక్కువ కావడంతో ఇక్కడ కొనుగోళ్లు కూడా విపరీతంగా జరుగుతుంటాయి.

వెండి కూడా....
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,200 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,300 రూపాయలుగా ఉంది. వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం కిలో వెండి ధర 64,900 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News