బంగారం ధర మళ్లీ పెరిగింది

ఈరోజు కూడా బంగారం ధర పెరిగింది. దేశ వ్యాప్తంగా బంగారం ధర పెరిగింది.

Update: 2021-12-15 01:10 GMT

బంగారం అంతే మరి. పెరగడమే కాని తగ్గడం అరుదుగా జరుగుతుంది. ఈరోజు కూడా బంగారం ధర పెరిగింది. దేశ వ్యాప్తంగా బంగారం ధర పెరిగింది. తులం బంగారంపై 130 రూపాయలు పెరిగింది. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తగ్గినా స్వల్పంగా తగ్గడం పెరిగితే భారీగా పెరగడం బంగారం విషయంలో మామూలే. అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ఒడిదుడుకులు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు.

ఇదిగో ఇలా...
ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45,250 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,360 రూపాయలుగా ఉంది. గ్రాముకు పదమూడు రూపాయలు పెరిగింది. వినియోగదారులు బంగారం ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని, రానున్న రోజుల్లో మరింత ధర పెరిగే అవకాశముందంటున్నారు నిపుణులు.


Tags:    

Similar News