Virat Kohli : డీలాపడిన తెలుగు రాష్ట్రాల క్రికెట్ ఫ్యాన్స్‌.. రీజన్ ఇదే

విరాట్ కొహ్లి ఇంగ్లండ్ తో జరిగే రెండు మ్యాచ్ లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని తెలిసింది

Update: 2024-01-23 03:54 GMT

క్రికెట్‌ను అభిమానించే వారు ప్రతి ఒక్కరూ ఒక్కసారి అయినా విరాట్ కొహ్లిని చూడాలనుకుంటారు. కానీ తెలుగు రాష్ట్రాల క్రికెట్ ఫ్యాన్స్ కు మాత్రం ఈసారి చేదువార్త. విరాట్ కొహ్లి ఇంగ్లండ్ తో జరిగే రెండు మ్యాచ్ లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. దీంతో విరాట్ కొహ్లి ఈ మ్యాచ్ లకు హాజరుకారని తెలిసి ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. అయితే వ్యక్తిగత కారణాలతోనే ఈ రెండు మ్యాచ్ లకు దూరంగా ఉండాలని విరాట్ కొహ్లి నిర్ణయించుకున్నాడని చెబుతున్నారు.

ఎల్లుండి నుంచి...
ఎల్లుండి నుంచి ఇంగ్గండ్ తో భారత్ తొలి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కు ఇప్పటికే టిక్కెట్లు అన్నీ అమ్ముడుపోయాయి. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో అమ్మకాలు పెట్టిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు స్టేడియం అంతా నిండిపోవడంతో కాసుల పంట పండింది. అయితే ఇందులో విరాట్ కొహ్లిని దగ్గర నుంచి చూద్దామని వచ్చే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఇంగ్లండ్ తో మొత్తం ఐదు టెస్ట్ మ్యాచ్ లను భారత్ నుండగా అందులో రెండు టెస్ట్‌లు ఒకటి హైదరాబాద్ లోనూ, మరొకటి విశాఖలోనూ జరగనుంది.
విశాఖలోనూ...
జనవరి ఇరవై ఐదు నుంచి జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ లోనూ, ఆ తర్వాత జరిగే రెండో టెస్ట్ విశాఖపట్నంలోనూ జరగనుంది. ఈ రెండు మ్యాచ్ లకు విరాట్ కొహ్లి దూరంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో విరాట్ ఫ్యాన్స్ డీలా పడ్డారు. మిగిలిన మూడు మ్యాచ్ లకు విరాట్ కొహ్లి అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ చెప్పింది. దీంతో విరాట్ కొహ్లి రాడని తెలిసిన ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. ఆయన స్థానంలో ఎవరిని ఆడించనున్నారన్నది తేలాల్సి ఉంది.


Tags:    

Similar News