BRS: త్వరలో బీఆర్ఎస్‌ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం

కొత్తగా ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారని

Update: 2024-07-12 09:46 GMT

కొత్తగా ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారని, 15 రోజుల్లో బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ లో చివరకు నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని అన్నారు. బీఆర్ఎస్ పై ఎమ్మెల్యేలకు నమ్మకం లేదని.. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారని దానం నాగేందర్ మండిపడ్డారు. కేసీఆర్ ను కలవడానికి ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ కూడా దొరికేది కాదని, ఒకవేళ దొరికినా గంటల తరబడి వెయిట్ చేయించేవారన్నారు. విలువ లేని చోట ఉండలేకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు.

బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వేల కోట్లు దోచుకున్నారని.. కేటీఆర్ బినామీలు కూడా వేల కోట్లు ఆర్జించారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ ఒక కార్పొరేట్ సంస్థ మాదిరి నడిపారన్నారు. బీఆర్ఎస్ చేసిన అవినీతికి సంబంధించిన ఆధారాలను త్వరలోనే బయట పెడతామన్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు.


Tags:    

Similar News