Telangana : గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియో విడుదల

గల్ఫ్ మృతుల ఎక్స్ గ్రేషియాకు 6 కోట్ల 45 లక్షల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది

Update: 2024-10-24 03:10 GMT

గల్ఫ్ మృతుల ఎక్స్ గ్రేషియాకురూ.6 కోట్ల 45 లక్షల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది.2023 డిసెంబర్ 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు గల్ఫ్ లో 160 మంది తెలంగాణ కార్మికులు మృతి చెందినట్లు అంచనా వేసింది. ముఖమంత్రి రేవంత్ రెడ్డి అదేశాల మేరకు గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు కోసం తెలంగాణ ప్రభుత్వ జిఎడి ఎన్నారై విభాగం ఈనెల 21వ తేదీన .6 కోట్ల 45 లక్షలను15 జిల్లాల కలెక్టర్లకు విడుదల చేసింది.

జిల్లాలకు విడుదల...
గల్ఫ్ మృతుల సంఖ్య ఆధారంగా నిజామాబాద్ జిల్లాకు కోటి 75 లక్షలు, జగిత్యాలకు కోటి 40 లక్షలు, రాజన్న సిరిసిల్లకు 60 లక్షలు, నిర్మల్ కు 50 లక్షలు, కామారెడ్డి, కరీంనగర్, మేడ్చల్, ఆదిలాబాద్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, మెదక్ జిల్లాకు 20 లక్షల చొప్పున నిధులు విడుదల చేసింది. దీంతో ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయడం పట్ల ఎన్నారై విభాగం హర్షం వ్యక్తం చేస్తుంది.


Tags:    

Similar News