Telangana : కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. అంతా ప్రశాంతంగానే

వరంగల్ - ఖమ్మం - నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది

Update: 2024-05-27 06:29 GMT

వరంగల్ - ఖమ్మం - నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల కోసం మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నిక పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకూ కొనసాగుతుంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో గ్రాడ్యుయేట్ ఓటర్లు వచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.

క్యూ లైన్ లో నిల్చుని...
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి లెక్కింపు జూన్ 5వ తేదీన జరగనుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేశ్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. మొత్తం 52 మంది ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలకు చెందిన 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.


Tags:    

Similar News