జర్నలిస్ట్ ను చితకబాదిన ఎమ్మెల్యే తమ్ముడు..!

Update: 2017-02-06 02:19 GMT

టీడీపీ నేతల ఆగడాలకు అంతు పొంతూ లేకుండా పోతోంది. గల్లీ స్థాయి నేతలు కూడా పెట్రేగి పోతున్నారు. గతంలో పార్టీని పూర్తిగా కంట్రోల్లో ఉంచుకున్న చంద్రబాబు ఈ మధ్య అలా వ్యవహరించడంలో విఫలాలమవుతున్నారు.మొదట్లో చింతమనేని ప్రభాకర్ వ్యవహారం.. మొన్నటికి మొన్న గుంటూరు జిల్లాలో టూరిజం శాఖాధికారిని ఎం ఎల్ సి అన్నం సతీష్ కొట్టిన ఘటన, నేరుగా ఎమ్మెల్యేలు తుపాకీలు చూపి బెదిరించడం, మంత్రి రావెల కిషోర్ బాబు కొడుకు బాగోతం.. ఇలా ఒక్కొక్కటిగా టీడీపీ ప్రభుత్వం పరువు తీశాయి. ఇక ఇప్పుడు ఏకంగా ఓ ఎమ్మెల్యే తమ్ముడు నేరుగా జర్నలిస్టును చితకబాదేశాడు. సాధారణంగా జర్నలిస్టుల జోలికి రాజకీయ నాయకులు రారు..కానీ ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తమ్ముడు మాత్రం ఓ జర్నలిస్టును నడిరోడ్డుపై గొడ్డును బాదినట్టు బాదేశాడు. కృష్ణమోహన్ సోదరుడు స్వాములు స్వయంగా దౌర్జన్యానికి దిగారు. మ్యాగజైన్లో తప్పుడు కథనం రాశాడం‍టూ నాగార్జున రెడ్డి అనే యువ జర్నలిస్టుఫై అనుచరులతో కలిసి దాడి చేశాడు.నడిరోడ్డుపై కర్రతో గొడ్డును బాదినట్లు బాదాడు. ఈ సంఘటన చీరాల గడియారం స్థంభం సెంటర్లో చోటుచేసుకుంది. ఈ దాడిని అక్కడ ఉన్న ఓ యువకుడు వీడియో తీశాడు. సోషల్ మీడియా లో ఈ వీడియో వైరల్ అవుతోంది. వరుస ఘటనల నేపథ్యంలో పార్టీ నాయకులకు చంద్రబాబు ఘాటుగా వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.బాబు గారు నేతల పిఛ్చి వేషాలను ఎలా అదుపు చేస్తారో చూడాలి.

Similar News