Chandrababu : నేడు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు.. రేపు కూడా అక్కడే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.

Update: 2024-08-16 03:24 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. నేడు, రేపు ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సాగుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రలుు అమిత్ షా, నిర్మలా సీతారామన్ ఇతరులను కలిసే అవకాశం ఉందని తెలిసింది.

రాష్ట్రానికి రావాల్సిన...
రాష్ట్రానికి కేంద్ర సాయం, పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయించడంపై చర్చించనున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు వెనుకబడిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రత్యేక నిధులను గురించి కూడా చంద్రబాబు చర్చించనున్నారు. చర్చించనున్నారరు., పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయించడంపై కూడా చర్చించనున్నారు. ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత చంద్రబాబు మూడోసారి ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు.


Tags:    

Similar News