Tirumala : తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్నటి వరకూ భక్తుల రద్దీ స్వల్పంగానే ఉంది.;

Update: 2024-02-20 02:39 GMT
crowd, devotees, que lines, tirumala, tirupathi news, andhranews

Tirumala

  • whatsapp icon

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్నటి వరకూ భక్తుల రద్దీ స్వల్పంగానే ఉంది. కానీ బుధవారం నాడు మాత్రం భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. వీకెండ్ లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఇంకా ఎక్కువగా ఉండనుంది.

హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 64,741 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,667 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.82 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనంలోకి టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు స్వామి వారి దర్శనం పథ్నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News