కెనడాలో జరిగిన సిక్కు హత్యలో భారత్ ప్రమేయం: జస్టిన్ ట్రూడో
కెనడా తన దేశంలో జరిగిన సిక్కు హత్యలో భారత్ ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో
కెనడా తన దేశంలో జరిగిన సిక్కు హత్యలో భారత్ ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో భారతదేశానికి చెందిన సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించింది. ఈ చర్య కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడా పౌరుడు, సిక్కు నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ను జూన్లో హత్య చేశారు. ఈ హత్యకు భారతదేశానికి సంబంధం ఉందనే విశ్వసనీయ సమాచారం తమకు దొరికిందని.. కెనడా దీనిపై దర్యాప్తు చేస్తోందని ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తెలిపారు. ట్రూడో సోమవారం పార్లమెంటులో మాట్లాడుతూ ఈ హత్యకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య వెనుక భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉన్నట్లు తమ ప్రభుత్వం వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించారు. ఈ విషయంలో తమకు సహకరించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.