ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి.

Update: 2021-12-16 11:36 GMT

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం మధ్యాహ్నం ఇంటర్ బోర్డు అధికారులు 2020-21 సంవత్సరం ఫస్ట్ ఇయర్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. బాలికలు 56 శాతం ఉత్తీర్ణులవ్వగా.. 42 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు.

ఉత్తీర్ణత సాధించిన వారు...
రాష్ట్ర వ్యాప్తంగా 6,59,222 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. వీరిలో 2,24,012 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను http://tsble.cgg.gov.in వెబ్ సైట్ ను లాగిన్ అయి చూడొచ్చని తెలిపారు. మార్కుల మెమోలను 17వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.


Tags:    

Similar News