సరిహద్దు చెక్ పోస్టు వద్ద ఏపీలో?

ఆంధ్రప్రదేశ్ లో తొలిరోజు కర్ఫ్యూ అమలయింది. అయితే రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద వాహనాలను నిలిపివేయడంతో కొందరు ఇబ్బంది పడ్డారు. పన్నెండు గంటల తర్వాత ఏపీ [more]

Update: 2021-05-06 00:44 GMT

ఆంధ్రప్రదేశ్ లో తొలిరోజు కర్ఫ్యూ అమలయింది. అయితే రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద వాహనాలను నిలిపివేయడంతో కొందరు ఇబ్బంది పడ్డారు. పన్నెండు గంటల తర్వాత ఏపీ సరిహద్దుల నుంచి ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. పన్నెండు గంటల లోపే ఏపీలోకి చేరుకోవాలని సూచిస్తున్నారు. అయితే అత్యవసర పనులు, ఆసుపత్రుల్లో వైద్యం వంటి వాటికి సంబంధించిన ఆధారాలు చూపితేనే ఏపీలోకి పోలీసులు పంపుతున్నారు. కొందరు కర్ఫ్యూ విషయం తెలియక వచ్చామని చెప్పినా తెలంగాణకు వెనక్కు పంపుతున్నారు. తొలిరోజు కావడంతో తెలియక వస్తున్నారని, తర్వాత క్రమంగా సర్దుబాటు అవుతుందని పోలీసులు చెబుతున్నారు.

Tags:    

Similar News