22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి

Update: 2024-07-20 07:23 GMT

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్‌ ప్రసంగంతో ఉభయసభల సమావేశాలు మొదలవనున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ ప్రసన్నకుమార్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఉన్నతాధికారులుతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమావేశమయ్యారు.

సమావేశాల నిర్వహణపై...
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించారు. ఈ నెల 22వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఐదురోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మొదటిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండనుంది. అనంతరం ప్రశ్నోత్తరాలు, శ్వేత పత్రాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు.


Tags:    

Similar News