Tiruamla : తిరుమలలో నేడు సులువుగానే స్వామి వారి దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. మంగళవారం అయినా రద్దీ పెద్దగా లేదు. కంపార్ట్‌మెంట్లన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి.

Update: 2024-09-24 03:35 GMT

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. మంగళవారం అయినా రద్దీ పెద్దగా లేదు. కంపార్ట్‌మెంట్లన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి. స్వామి వారిని సులువుగా దర్శించుకునేందుకు వీలుంది. తక్కువ మంది భక్తులు ఉండటంతో పెద్దగా ఇబ్బందులు పడకుండానే వసతిగృహాలు దొరుకుతున్నాయి. వేచి ఉండకుండానే వసతి గృహాలు దొరుకుతుండటంతో పాటు వెనువెంటనే తలనీలాల సమర్పణ వంటి కార్యక్రమాలను పూర్తి చేసుకుని భక్తులు దర్శనానికి వెళుతున్నారు. నిన్నటి నుంచి తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. అయితే తిరిగి దసరా సెలవులు అక్టోబరు 2వ తేదీ నుంచి ప్రారంభం కానుండటంతో రద్దీ మరింత పెరిగే అవకాశముంది. పండగకు ముందు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఉంటుందని మాత్రం అధికారులు చెబుతున్నారు. హుండీ ఆదాయం మాత్రం తగ్గడం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. దసరా సమయంలో స్వామి వారిని దర్శించుకునేందుకు కష్టంగా ఉంటుందని, బ్రహ్మోత్సవాలకు అధిక శాతం మంది హాజరవుతారని, అప్పుడు ఆర్జిత సేవలు కూడా ఉండవని అధికారులు చెబుతున్నారు.

ఒక్క కంపార్ట్‌మెంట్‌లోనే...
తిరుమలలో రద్దీ కొంత వరకూ తగ్గడంతో అధికారులు దసరాకు సంబంధించిన ఏర్పాట్లను ప్రశాంతంగా చేసుకుంటున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఒక కంపార్ట్‌మెంట్‌లోనే భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా వెళ్లిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయంలోనే పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. టైమ్ స్లాట్ టోకెన్లున్న భక్తులకు మూడు గంటల సమయంలో దర్శనం పూర్తవుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయంలో పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. భక్తులు క్యూ లైన్ లో పెద్దగా వేచి ఉండటం లేదు. నేరుగా వెళుతున్న సందర్భాలున్నాయి. నిన్న తిరుమల శ్రీవారిని 65,604 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,266 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.85 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News