Tirumala : మెడలో పదిహేను కోట్ల బంగారం.. తిరుమల దర్శనానికి వచ్చి?

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఒక కుటుంబం మెడలో బంగారాన్ని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు

Update: 2024-08-23 12:59 GMT

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఒక కుటుంబం మెడలో బంగారాన్ని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. వారి మెడ నిండా గోల్డ్. దాదాపు ఇరవై ఐదు కిలోల బంగారాన్ని ధరించి వారు తిరుమలకు వచ్చి శ్రీవారినా దర్శనం చేసుకున్నారు. ముంబయికి చెందిన ఒక కుటుంటం శ్రీవారి దర్శనానికి భారీగా బంగారు నగలు ధరించి రావడంతో పూజారుల నుంచి భక్తులు, తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది సయితం ఆశ్చర్యపోయారు.

పదిహేను మంది సెక్యూరిటీతో...
పురుషులు పది కేజీల చొప్పున మెడలో బంగారు ఆభరణాలను ధరించగా, మహిళ ఐదు కేజీల బంగారాన్ని ధరించి వచ్చారు. వీరు ధరించిన బంగారం విలువ పదిహేను కోట్ల పైనే ఉంటుందని చెబుతున్నారు. వీరు ముంబయికి చెందిన వారు. అయితే వీరి రక్షణ.. కాదు.. కాదు గోల్డ్ ను రక్షించడానికి పదిహేను మంది సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. ఇదెక్కడి చోద్యంరా బాబూ అంటూ భక్తులు గుసగుసలాడుకుంటున్నారు.


Tags:    

Similar News