Tirumala : తిరుమలలో నేడు స్వామి వారి దర్శనం సులువుగా.. ఎందుకంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అయితే సోమవారం కావడంతో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది.

Update: 2024-07-01 04:08 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అయితే సోమవారం కావడంతో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. నిన్నటి వరకూ తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో తిరుమల వీధులన్నీ కిటకిటలాడిపోయాయి. అయితే నేడు కొంత భక్తుల రద్దీ తగ్గిందనే చెప్పాలి. పెద్దగా సమయం లేకుండానే శ్రీవారిని భక్తులు దర్శించుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. మూడు వందల రూపాయల టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లోనే పూర్తవుతుందని అధికారులు తెలిపారు.

నాలుగు కంపార్ట్‌మెంట్లలోనే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని నాలుగు కంపార్ట్‌మెంట్లలోనే శ్రీవారి భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 81,005 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,244 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.94 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News