Tirumala : కలియుగ వైకుంఠంలో తగ్గని భక్తుల రద్దీ.. క్యూలైన్లు నిండిపోయి

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. మంగళవారం కూడా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు

Update: 2024-06-25 02:58 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. మంగళవారం కూడా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. జూన్ నెలలో తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. జూన్ నెలలో పాఠశాలలు తెరుస్తుండటంతో భక్తుల రద్దీ అంతగా ఉండదు. కానీ ఈ ఏడాది జూన్ లో మాత్రం గత ఇరవై రోజుల నుంచి భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. స్వామి వారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారాయి. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటలకు పైగానే సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

పద్దెనిమిది గంటలు...
ఈరోజు కూడా తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. కంపార్ట్‌మెంట్లలో ఉన్న భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 77,878 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 30,140 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.46 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. మరికొన్ని రోజులు ఇదే తరహా రద్దీ కొనసాగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News