నేడు అమరావతిలో డ్రోన్ షో

అమరావతిలో నేడు డ్రోన్ సమ్మిట్ జరగనుంది. దేశానికే ఆంధ్రప్రదేశ్ ను డ్రోన్ టెక్నాలజీ హబ్ గా తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

Update: 2024-10-22 02:25 GMT

అమరావతిలో నేడు డ్రోన్ సమ్మిట్ జరగనుంది. దేశానికే ఆంధ్రప్రదేశ్ ను డ్రోన్ టెక్నాలజీ హబ్ గా తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకోసమే డ్రోన్ల సమ్మిట్ ను విజయవాడలో ఏర్పాటు చేశారు. ఈ సమ్మిట్ కు ఇన్విస్టెర్లతో పాటు ఇన్వెంటర్లు కూడా హాజరు కానున్నారు. దాదాపు 5000లకు పైగా డ్రోన్ లతో షో నిర్వహించనున్నారు.

ఐదువేల డ్రోన్లతో...
సాయంత్రం నిర్వహించనున్న ఈ డ్రోన్ షోకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిధిగా హాజరు కానున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా హాజరుకున్నారు. ఈ సదస్సులో మొత్తం 53 స్టాళ్లను ఏర్పాటు చేశారు. అమరావతి రాజధాని ప్రాంతాన్ని డ్రోన్ హబ్ గా తయారు చేయాలన్న లక్ష్యంతో ఈ సమ్మిట్ ను ఏర్పాటు చేశారు. ఈ డ్రోన్ షో తిలకించడానికి ప్రజలు కూడా అత్యధిక సంఖ్యలో హాజరు కానున్నారు.


Tags:    

Similar News