Tiruamala : తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ..రీజన్ ఇదే

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది.

Update: 2024-07-08 03:47 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. గత కొద్ది రోజుల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ముందుగా దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తుల కూడా తిరుమలకు చేరుకుంటున్నారు. అందుకే భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నేడు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.

23 కంపార్ట్‌మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఇరవై మూడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఈరోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 78,912 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 32,039 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.83 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News