Tirumala : సండే నాడు.. తిరుమలలో భక్తుల రద్దీ మూమూలుగా లేదుగా?

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆదివారం కావడంతో ఎక్కువ మంది భక్తులు తిరుమలకు వచ్చారు. దీంతో తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతుంది.

Update: 2024-08-11 04:03 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆదివారం కావడంతో ఎక్కువ మంది భక్తులు తిరుమలకు వచ్చారు. దీంతో తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతుంది. మాడవీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. శనివారం నుంచి భక్తుల రాక ఎక్కువయిందని ఆదివారానికి మరింత తాకిడి పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి క్యూ లైన్ బయటకు విస్తరించి ఉండటంతో భక్తులు ఇబ్బంది పడకుండా అన్న ప్రసాదాన్ని, మంచినీటిని శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్నారు. క్యూ లైన్ లో ఉన్న భక్తులు స్వామి వారిని దర్శించుకునేంత వరకూ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. వసతి గృహాల కోసం కూడా గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుందని భక్తులు చెబుతున్నారు.

24 గంటల సమయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. బయట ఏటీజీహెచ్ వరకూ క్యూ లైన్ విస్తరించి ఉంది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు ప్రవేశించిన భక్తులకు స్వామి వారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తెలిపారు. టైమ్ స్లాట్ టోకెన్లు ఉన్న భక్తులు ఆరు గంటల్లో శ్రీవారిని దర్శించుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 79,313 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 39, 344 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.65 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News