Revanth Reddy : నేడు ఆంధ్రప్రదేశ్ కు రేవంత్ రెడ్డి

నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళుతున్నారు.

Update: 2024-07-08 02:22 GMT

నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళుతున్నారు. విజయవాడలో జరగనున్న వైఎస్సార్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మరికొందరు మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

ఈ వేడుకలకు...
వైఎస్సార్ జయంతి వేడుకలకు హాజరు కావాలని పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆహ్వానం మేరకు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. వైఎస్సార్ కు ఘనంగా నివాళులర్పించేందుకు కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా నేతలు రానున్నారు. వైఎస్సార్ 75వ జయంతి వేడుకలను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.


Tags:    

Similar News