చూద్దాం.. ఆగమంటున్న హీరోలు!!

అక్టోబర్ 15 నుండి థియేటర్స్ ఓపెన్ చెయ్యడానికి రంగం సిద్దమవుతుంది. 50 శాతం ప్రేక్షకులతో కాదు…. 100 శాతం ప్రేక్షకులతోనే థియేటర్స్ ఓపెన్ కావాలంటూ రాజమౌళి లాంటి [more]

Update: 2020-10-07 05:18 GMT

అక్టోబర్ 15 నుండి థియేటర్స్ ఓపెన్ చెయ్యడానికి రంగం సిద్దమవుతుంది. 50 శాతం ప్రేక్షకులతో కాదు…. 100 శాతం ప్రేక్షకులతోనే థియేటర్స్ ఓపెన్ కావాలంటూ రాజమౌళి లాంటి దర్శకుడే చెబుతున్నాడు. ప్రస్తుతం 50 శాతం ప్రేక్షకులతో థియేటర్స్ ఓపెన్ అయినా ప్రేక్షకులు థియేటర్స్ కి ధైర్యంగా వస్తరా లేదా అనేది తెలియాలంటే థియేటర్స్ లో క్రేజ్ ఉన్న బొమ్మ పడాలి. అప్పుడుగాని ప్రేక్షకుల మీద హీరోలు ఓ అంచనాకు రారు. కాదు ప్రేక్షకులు కరోనా భయంతో థియేటర్స్ కి రారనుకుని సినిమాలు విడుదల చెయ్యకుండా ఆగితే.. ఎవరికీ నష్టం. మరి థియేటర్స్ ఓపెన్ అంటున్నా హీరోలెవరూ సినిమాల డేట్స్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.

దసరాకి మంచి సీజన్ సినిమాలు రిలీజ్ అవ్వడానికి.. అనుకుంటే.. హీరోలు ధైర్యం చెయ్యడం లేదు. అంటే ఈ దసరా సీజన్ వెళితే కానీ.. హీరోలు కదిలేలా లేరు. అంటే దివాలి కి అయినా హీరోలు ధైర్యం చేస్తారా? లేదంటే సంక్రాంతికే సినిమాలు విడుదలకు స్టిక్ అవుతారా అనేది తెలియాల్సి ఉంది. థియేటర్స్ ఓపెన్ అవుతుంటే ఓటిటీలు బెంబేలెత్తుతున్నాయి. తమకి సినిమాలు అమ్మారని అని ఫిక్స్ అవుతున్నారు. ఇక హీరోలు కూడా థియేటర్స్ ఓపెన్ అయ్యాయి కదా అని పొలోమంటూ సినిమాల విడుదల తేదీలు ప్రకటించెయ్యకుండా దర్శకనిర్మాతలతో చూద్దాం ఆగమంటున్నారు. లేదంటే రామ్ రెడ్, వైష్ణవ తేజ్ ఉప్పెన, సాయి ధరమ్ సోలో బ్రతుకే సో బెటరు, నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమాల డేట్స్ రావడం ఏమిటి ప్రమోషన్స్ కూడా హీరోలు మొదలు పెట్టేవారు. కానీ చూద్దాం ఆగండి అన్నారంటే… థియేటర్స్ ఓపెన్ అయ్యాక పరిస్థితులని బట్టి హీరోలు ముందుకు అడుగేస్తారన్నమాట. 

Tags:    

Similar News