ఖుష్బూకు కీలక పదవి

భారతీయ జనతా పార్టీ నేత ఖుష్బూ సుందర్ కి కేంద్ర ప్రభుత్వం కీలక పదవిని అప్పగించింది

Update: 2023-02-27 12:25 GMT

భారతీయ జనతా పార్టీ నేత ఖుష్బూ సుందర్ కి కేంద్ర ప్రభుత్వం కీలక పదవిని అప్పగించింది. జాతీయ మహిళ కమిషన్ సభ్యురాలిగా నియమిస్తూ కేంద్ర మహిళ శిశు సంక్షేమ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్న ఖుష్బూకు ఈ లభించడం విశేషం.

అభిమానుల్లో ఆనందం...
ఖుష్బూతో పాటుగా సీనియర్ సినీ ఆర్టిస్ట్ మమతా కుమారి, డెలీనా ఖోంగ్‌డుప్ లను కూడా జాతీయ సభ్యులుగా నామినేట్ అయ్యారు. ఖుష్బూకు ఈ పదవి లభించడంపై ఆమె అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఖుష్బూ సేవలను అధినాయకత్వం గుర్తించిందని ట్వీట్ చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా ఖుష్బూకు పదవి లభించడంపై అభినందనలు చెబుతున్నారు.


Tags:    

Similar News