జేఈఈ మెయిన్ పరీక్షలు వాయిదా

జేఈఈ మెయన్ పరీక్షలు వాయిదా పడ్డాయి. రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు

Update: 2022-07-20 13:22 GMT

జేఈఈ మెయన్ పరీక్షలు వాయిదా పడ్డాయి. రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు. మెయిన్ పరీక్షలు తిరిగి ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని అధికారులు చెప్పారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21వ తేదీన జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభమై ఈ నెల 30వ తేదీతో ముగియాల్సి ఉంది. అయితే రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.

కారణాలు మాత్రం...
వాయిదాకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ నెల 25వ తేదీ నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభమవుతాయని మాత్రం చెప్పారు. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక ప్రకటన విడుదల చేసింది. 517 కేంద్రాల్లో జరుగనున్న ఈ పరీక్షలకు 6.29 లక్షల మంది హాజరుకానున్నారని తెలిపింది. రేపటి నుంచి హాల్ టిక్కెట్లు వెబ్ సైట్ లో ఉంటాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది.


Tags:    

Similar News