‍Narendra Modi : నేడు ఇటలీకి ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఇటలీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు

Update: 2024-06-13 02:42 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఇటలీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఇటలీలో నేటి నుంచి జీ 7 సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్ లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఇటలీ బయలుదేరి వెళ్లనున్నారు. ఇటలీ పర్యటనలో నరేంద్ర మోదీ గాంధీ విగ్రహాన్ని అక్కడ ఆవిష‌్కరించాాల్సి ఉంది.

ఆవిష్కరణకు ముందుగానే...
అయితే ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న గాంధ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంపై భారత విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రధాని పర్యటన ఉండటంతో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జీ 7 సమ్మిట్ వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు.


Tags:    

Similar News