కేంద్ర కేబినెట్ లో ఏడుగురు మాజీ సీఎంలు

నరేంద్ర మోదీ కేబినెట్ లో ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులున్నారు

Update: 2024-06-10 02:18 GMT

నరేంద్ర మోదీ కేబినెట్ లో ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులున్నారు. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారికి కేంద్ర మంత్రులుగా ఈసారి అవకాశం కల్పించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, బీహార్ కు చెందిన జితిన్ రామ్ మాంఝిలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. ఎన్డీఏ మిత్రపక్షాల నుంచి వీరిద్దరూ మాజీ ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులయ్యారు.

సీనియర్లకు అవకాశం...
అలాగే బీజేపీకి చెందిన ఐదుగురు మాజీ ముఖ్యమంత్రులకు మోదీ తన కేబినెట్ లో అవకాశం కల్పించారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజ్‌నాథ్ సింగ్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, అస్సోం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ లు కూడా ఉన్నారు.


Tags:    

Similar News