Narendra Modi : గుడ్ న్యూస్.. నేడు ఆ రూట్లలో వందేభారత్.. ప్రారంభించనున్న మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు.

Update: 2024-08-31 02:19 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేడు మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. దక్షిణ రైల్వేజోన్ కు చెందిన రెండు రైళ్లతో పాటు ఉత్తర్‌ప్రదేశ్ లో మరో రైలు ప్రారంభిస్తారు. దక్షిణ భారత దేశంలో చెన్నై టు నాగర్‌కోయిల్ రైలును ప్రారంభించనున్నారు. ఈ రైలు చెన్నైతో పాటు నాగర్‌కోయిల్ మధ్య నడవనుంది. ఈరైలు బుధవారం మినహా మిగిలిన ఆరు రోజుల పాటు నడుస్తుంది. ఈ రైలు చెన్నై, తాంబరం, విల్లుపురం, తిరుచ్చిరాపల్లి, దిండిగల్, మధురై, కోవిల్‌పల్లి, తిరునెల్వేలితో పాటు నాగర్ కోయిల్ వరకూ వెళుతుంది.

వారానికి ఆరు రోజులు...
ఉదయం ఐదు గంటలకు బయలుదేరి  మధ్యాహ్నం 1.50 గంటలకు నాగర్‌కోయిల్ కు చేరుకుంటుంది. మరొకటి మధురై - బెంగళూరు కంటోన్మెంట్ రైలు ను కూడా నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. రైలు దిండిగల్, తిరుచ్చిరాపల్లి, కరూర్, నమక్కల్, సేలం, కృష్ణరాపురం స్టేషన్ల మీదుగా బెంగళూరుకు సెంట్రల్ కు స్టేషన్ కు చేరుకుంటుంది. ఈ రైలు మంగళవారం మినహా వారం రోజుల్లో మిగిలిన ఆరురోజులు నడుస్తుంది. మరో రైలు ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ నుంచి లక్నో మధ్య నడుస్తుంది.


Tags:    

Similar News