నేటి నుంచి రైళ్ల రైకపోకలు ప్రారంభం

నేటి నుంచి రైళ్లు మళ్లీ నడవనున్నాయి. వర్షాల తో ఇంటికన్నె వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలునిలిచి పోయాయి

Update: 2024-09-04 02:36 GMT

నేటి నుంచి రైళ్లు మళ్లీ నడవనున్నాయి. గత నాలుగు రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా వరంగల్ జల్లాలోని మహబూబాబాద్ వద్ద గల ఇంటికన్నె వద్ద రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. దీనిని రైల్వే శాఖ అధికారులు,సిబ్బంది యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేశారు. మూడు రోజుల్లోనే ట్రాక్ ను సిద్ధం చేశారు.

మూడు రోజుల నుంచి...
గత మూడు రోజుల నుంచి వరంగల్ - విజయవాడ ల మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ట్రాక్ ను పునరుద్ధరించడంతో నేటి నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. వరంగల్ మీదుగా ఢిల్లీకి రైళ్ల రాకపోకలు సాగనున్నాయి. దీంతో ప్రయాణికులు ఆనంద పడిపోతున్నారు. అయితే కొత్త ట్రాక్ కనుక ఈ ట్రాక్ పై రైళ్లు నెమ్మదిగా వెళ్లాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచించారు.


Tags:    

Similar News