KTR : రేపు నాంపల్లి కోర్టుకు కేటీఆర్ హాజరు

రేపు నాంపల్లి కోర్టుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరు కానున్నారు.

Update: 2024-10-17 02:34 GMT

KTR

రేపు నాంపల్లి కోర్టుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరు కానున్నారు. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన కేసులో ఆయన హాజరు కానున్నారు. ఆయన స్టేట్‌మెంట్‌ను ఈ నెల 18వ తేదీన రికార్డు చేయాలని కోర్టు ఆదేశించడంతో రేపు నాంపల్లి కోర్టుకు కేటీఆర్ హాజరుకానున్నారు. తనపై వివాదాస్పద వ్యాఖ్యలను కొండా సురేఖ చేసినందున ఆమెపై పరువు నష్టం దావాను కేటీఆర్ వేశారు.

18వ తేదీకి వాయిదా వేయడంతో...
దీనిపై ఈ నెల 14వ తేదీన విచారణ జరిపిన న్యాయస్థానం 18వ తేదన స్టేట్‌మెంట్ ను రికార్డు చేయాలని చెప్పడంతో ఆయన హాజరు కావాల్సి ఉంటుంది. కేటీఆర్ తో పాటు ఈ కేసులో బీఆర్ఎస్ నేతలు బాల్క సముాన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రావణ్ ల సాక్ష్యాలను కూడా రికార్డు చేయనున్నారు. వారు కూడా నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు.
Tags:    

Similar News