KTR : నేడు సొంత ఖర్చులతో నిర్మించిన పాఠశాల భవనం ప్రారంభం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సొంత ఖర్చులతో నిర్మించిన పాఠశాల భవానాన్ని నేడు ప్రారంభించనున్నారు.

Update: 2024-09-26 04:15 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సొంత ఖర్చులతో నిర్మించిన పాఠశాల భవానాన్ని నేడు ప్రారంభించనున్నారు. సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం కొదురుపాకలో జడ్పీ పాఠశాలలో కేటీఆర్ నూతన భవనాలను నిర్మించారు. గతంలో ఈ పాఠశాలలో రెండు గదుల్లోనే ఉండేది. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. తమ సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన తనసొంత ఖర్చులతో భవనాలను నిర్మిస్తామని చెప్పారు.

అమ్మమ్మ, తాతయ్యల పేరిట...
తన అమ్మమ్మ, తాతయ్యల పేరిట ఈ భవనాలను నిర్మించారు. జోగినపల్లి లక్ష్మి, కేశవరాు పేరిట ఈ నూతన భవనాలను కేటీఆర్ నిర్మించి తన ఉదారతను చాటుకున్నారు. రెండు ఫ్లోర్లలో పద్దెనిమిది గదుల భవనాలను నిర్మించి ఇచ్చారు. వంట గదిని కూడా ప్రత్యేకంగా నిర్మించారు. విద్యార్థులకు పూర్తి స్థాయి వసతులతో ఈ భవనాలను నిర్మించారు. నేడు ఈ భవనాన్ని కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు హాజరుకానున్నారు.


Tags:    

Similar News