హైదరాబాద్-సికింద్రాబాద్ లలో 24 రైళ్లు, 22 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

కాజీపేట–డోర్నకల్, విజయవాడ–డోర్నకల్, భద్రాచలం–విజయవాడ, విజయవాడ–భద్రాచలం, సికింద్రాబాద్–వికారాబాద్, వికారాబాద్–కాచిగూడ

Update: 2023-07-02 06:17 GMT

train accident, collision, three killed, medchal

హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో వారంరోజుల పాటు 24 రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు వివరించారు. ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు వివిధ రూట్లలో నడుస్తున్న 24 రైళ్లను ఆపేస్తున్నట్లు ప్రకటించారు. దేవిధంగా లింగంపల్లి, ఫలక్ నుమా, ఉందానగర్, రామచంద్రాపురం మధ్య నడిచే 22 ఎంఎంటీఎస్ సర్వీసులను కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.

3 నుంచి 9వ తేదీ వరకూ రద్దైన సర్వీసులు

కాజీపేట–డోర్నకల్, విజయవాడ–డోర్నకల్, భద్రాచలం–విజయవాడ, విజయవాడ–భద్రాచలం, సికింద్రాబాద్–వికారాబాద్, వికారాబాద్–కాచిగూడ, సికింద్రాబాద్–వరంగల్, వరంగల్–హైదరాబాద్, సిర్పూర్ టౌన్–కరీంనగర్, కరీంనగర్–నిజామాబాద్, కాజీపేట–సిర్పూర్ టౌన్, బల్లార్షా–కాజీపేట, భద్రాచలం–బల్లార్షా, సిర్పూర్ టౌన్–భద్రాచలం, కాజీపేట–బల్లార్షా, కాచిగూడ–నిజామాబాద్, నిజామాబాద్–నాందేడ్ మధ్య నడిచే రైళ్లను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. అలాగే.. కాచిగూడ-మహబూబ్ నగర్ మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ ఉందానగర్ వరకు, నాందేడ్–నిజామాబాద్-పండర్పూర్ ఎక్స్ ప్రెస్ ను ముత్కేడ్ వరకు మాత్రమే నడుస్తాయన్నారు.

ఈ రూట్లలో రద్దవ్వనున్న 22 ఎంఎంటీఎస్ సర్వీసులు

ట్రాక్ లైన్ల మరమ్మతుల నేపథ్యంలో.. వివిధ రూట్లలో నడుస్తున్న 22 ఎంఎంటీఎస్ రైళ్లను కూడా రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. వివిధ రూట్లలో నడుస్తున్న 22 ఎంఎంటీఎస్ రైళ్లను కూడా రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. లింగంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి మధ్య నడిచే 10 రైళ్లు, లింగంపల్లి-ఉందానగర్ 3, లింగంపల్లి-ఫలక్ నుమా 2, ఉందానగర్-లింగంపల్లి 4, ఫలక్ నుమా-లింగంపల్లి 2, రామచంద్రాపురం-ఫలక్ నుమా మధ్య నడిచే ఒక రైలును రేపటి నుంచి 9వ తేదీ వరకూ రద్దు చేస్తున్నట్లు తెలిపారు.


Tags:    

Similar News