Telangana : గ్రూప్ వన్ పరీక్షల హాల్ టిక్కెట్లు నేటి నుంచే

తెలంగాణలో నేటి నుంచి గ్రూపు వన్ అభ్యర్థులు హాల్ టిక్కెట్లు డౌన్ లౌడ్ చేసుకోవచ్చు

Update: 2024-10-14 02:34 GMT

తెలంగాణలో నేటి నుంచి గ్రూపు వన్ అభ్యర్థులు హాల్ టిక్కెట్లు డౌన్ లౌడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు టీజీపీఎస్సీ ఒక ప్రకటన చేసింది. అభ్యర్థుల హాల్ టిక్కెట్లను వెబ్‌సైట్లను ఉంచామని పేర్కొంది. మెయిన్స్ కు అర్హత సాధించిన అభ్యర్థులందరూ తమ వివరాలను నమోదు చేసి ఈ హాల్ టిక్కెట్ ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.

పరీక్షలకు సంబంధించి...
అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకూ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో హాల్ టిక్కెట్లను అభ్యర్థులకు అందుబాటులోకి తెచ్చింది. ఏదైనా డౌన్ లోడ్ లో సమస్యలుంటే వెంటనే టోల్‌ ఫ‌రీ నెంబరుకు కాల్ చేయవచ్చని సూచించింది. లేదంటే టీజీపీఎస్సీ అధికారులను సంప్రదించవచ్చని పేర్కొంది. మొత్తం 563 పోస్టులకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.


Tags:    

Similar News