కేబినెట్ లో చోటుపై క్లారిటీ ఇచ్చిన కోదండరాం

ఎమ్మెల్సీ కోదండరాం తనకు మంత్రి వర్గంలో స్థానం దక్కడడంపై జరుగుతున్న ప్రచారంలో ఆయన క్లారిటీ ఇచ్చారు.

Update: 2024-08-22 12:33 GMT

ఎమ్మెల్సీ కోదండరాం తనకు మంత్రి వర్గంలో స్థానం దక్కడంపై జరుగుతున్న ప్రచారంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. మంత్రివర్గంలో తనకు అవకాశం ఇస్తారన్నది కేవలం ఊహాగానాలేనని ఆయన కొట్టి పారేశారు. మీడియా చిట్ చిట్ లో కోదండరామ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవిపై చర్చ ఎక్కడా జరగలేదన్నారు

రాజీవ్ విగ్రహం పెట్టొచ్చు...
రాజీవ్‌గాంధీ విగ్రహం విషయంలో..విద్వేషపూరితంగా పోవాల్సిన అవసరం లేదని కోదండరాం అన్నారు. సచివాలయ ప్రాంగణంలో..రాజీవ్‌గాంధీ, తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టడానికి ఎందుకు అభ్యంతరం ఉంటుందని ఆయన తెలిపారు. గ్రూప్‌-1,2,3,4 కలిపి ఒకేసారి పరీక్ష నిర్వహించడం మంచిదని కోదండరామ్ తెలిపారు.


Tags:    

Similar News