కవిత బెయిల్ పిటీషన్ విచారణ రేపటికి వాయిదా

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది

Update: 2024-05-27 08:26 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణను రేపటికి వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటీషన్లను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత మార్చి 15వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు.

రేపు ఈడీ, సీబీఐ...
ఈరోజు కవిత తరుపున న్యాయవాదులు తమ వాదనను వినిపించారు. రేపు ఎన్‌‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ తరుపున వాదనలు వింటామని న్యాయస్థానం తెలిపింది. విచారణను రేపటికి వాయిదా వేసింది. కవితకు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలయిన పిటీషన్లను ట్రయల్ కోర్టు కొట్టివేయడంతో ఆమె తరుపున న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు కవిత బెయిల్ పిటీషన్ పై విచారణ జరిగింది.


Tags:    

Similar News