వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Update: 2022-11-30 01:57 GMT

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుపై షర్మిలతో పాటు మరో ఆరుగురికి బెయిల్ మంజూరయింది. రాత్రి పది గంటల సమయంలో బెయిల్ మంజూరు కావడంతో వైఎస్సార్టీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. తొలుత ఆరున్నర గంటల ప్రాంతంలో షర్మిలను నాంపల్లి కోర్టుకు వైఎస్ షర్మిలను తరలించారు.

పది గంటల ప్రాంతంలో...
ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెకు అక్కడే వైద్య పరీక్షలు చేశారు. ఆమెపై మూడు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. షర్మిలతో పాటు మరో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.వీఐపీ రహదారిపై హంగామా చేశారని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని వైఎస్ షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు పోలీసులు వైఎస్ షర్మిలను తరలించారు.


Tags:    

Similar News