Breaking : మంత్రి కొండా సురేఖకు కోర్టు నోటీసులు

మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీకి తదుపరి విచారణకు వాయిదా వేసింది

Update: 2024-10-10 08:41 GMT

 konda surekha

మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీకి తదుపరి విచారణకు వాయిదా వేసింది. హీరో నాగార్జున కొండా సురేఖ పై పరువు నష్టం, క్రిమినల్ చర్యల కింద దావా వేశారు. దీనిపై విచారించిన కోర్టు కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు కొండా సురేఖ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

నాగార్జున కుటుంబంపై...
అయితే మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి కేటీఆర్ ను విమర్శలు చేస్తూ ఆమె నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. అయితే దీనిపై నాగార్జున తన కుటుంబ పరువుకు నష‌్టం కలిగిందని భావించి పరువు నష్టం దావా వేశారు.
Tags:    

Similar News