మాజీ మంత్రి బంధువులపై కేసు నమోదు

బీఆర్ఎస్ నేత హరీశ్ రావు బంధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Update: 2024-10-18 04:05 GMT

  Hyderabad Police 

బీఆర్ఎస్ నేత హరీశ్ రావు బంధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ భవనంలో అక్రమంగా చొరబడి నివాసం ఉన్నారని, ఫోర్జరీ సంతకాలతో చీటింగ్ కు పాల్పడ్డారంటూ మియాపూర్ పోలీస్ స్టేషన్ కు దండు లచ్చిరాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

భవనాన్ని ఆక్రమించుకుని...
తన్నీరు గౌతమ్, తన్నీరు పద్మజారావు, జంపన ప్రభావతి, గారపాటి నాగభైరవి, గోని రాజకుమార్ గౌడ్, బోయినపల్లి వెంకటేశ్వరరావులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై ట్రెస్ పాస్, ఛీటింగ్ కేసులు నమోదయ్యాయి. హరీశ్‌రావు బంధువులైన వీరు తనకు తెలియకుండానే తన ఇంటిని విక్రయించారంటూ చేసిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News