రాహుల్ గాంధీని పీఎం చేసేవారే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అసలైన వారసులట

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని

Update: 2024-07-08 10:08 GMT

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని ఏపీలో అటు వైసీపీ వర్గాలు, తెలంగాణలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడానికి కృషి చేసేవారే వైఎస్ రాజశేఖరరెడ్డి వారసులు అవుతారన్నారు. రాహుల్ నాయకత్వానికి వ్యతిరేకంగా వెళ్ళేవారు ఎట్టిపరిస్థితుల్లో వైఎస్ వారసులు కారన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే తన లక్ష్యమని వైఎస్ చెప్పేవారని.. కాలం కాటువేసిందో, దురదృష్టం వెంటాడిందో గానీ రాహుల్ గాంధీ ప్రధాని కాకముందే వైఎస్ చనిపోయారన్నారు. రాహుల్ పాదయాత్రకు వైఎస్ చేసిన పాదయాత్ర స్ఫూర్తి అని.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రాహుల్ గాంధీ పాదయాత్ర కూడా కారణమని అన్నారు. పేదల గుండెల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్ర చాలా బలంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు ఆయనే స్ఫూర్తి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

స్పెషల్ వీడియో పోస్టు చేసిన రాహుల్ గాంధీ: 
కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించారు. ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ బ‌తికి ఉంటే ఏపీ ప‌రిస్థితి మ‌రోలా ఉండేద‌న్నారు. ఆయ‌న‌ను కోల్పోవ‌డం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తీర‌ని లోట‌ని.. వైఎస్ రాజ‌కీయ వార‌స‌త్వాన్ని ష‌ర్మిల కొన‌సాగిస్తార‌ని అన్నారు. తాను ప్రారంభించిన భార‌త్ జోడో యాత్ర‌కు ఒక ర‌కంగా వైఎస్ఆర్ పాద‌యాత్ర స్ఫూర్తి అని అన్నారు. వ్యక్తిగతంగా ఆయన నుంచి చాలా నేర్చుకున్నాన‌ని అన్నారు.


Tags:    

Similar News