నేడు బీజేపీ పదాధికారుల సమావేశం

తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతలు నేడు సమావేశం కానున్నారు

Update: 2024-08-06 02:42 GMT

తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతలు నేడు సమావేశం కానున్నారు. పదాధికారులతో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భేటీ కానున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ నేతలతో పాటు పదాధికారులు కూడా హాజరు కానున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల పై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో...
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు అవసరమైన వ్యూహాలను రచించేందుకు ఈ సమావేశం జరగనుంది. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకూ అన్ని విషయాలను ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కూడా చర్చ జరగనుంది.


Tags:    

Similar News