Chandrababu : కేబినెట్ లో చంద్రబాబు సీరియస్... మంత్రులకు చీవాట్లు

ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ లో సీరియస్ అయ్యారు. ఉచిత ఇసుకవిధానంపై ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు

Update: 2024-10-16 12:11 GMT

cabinet meet in ap

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ లో సీరియస్ అయ్యారు. ఉచిత ఇసుకవిధానంపై ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు మంత్రులపై కూడా మండిపడ్డారు. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెడితే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా ఉచిత ఇసుక విషయంలో జోక్యం చేసుకోవడమేంటని ప్రశ్నించినట్లు చెబుతున్నారు. ఇసుక ఉచితంగా ఇస్తున్నప్పటికీ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు సోషల్ మీడియా, ఒక వర్గం మీడియాలో వస్తున్న వార్తలను ఎందుకు ఖండించలేకపోతున్నారని కూడా చీవాట్లు పెట్టినట్లు తెలిసింది.

ఉచిత ఇసుకను...
అలాగయితే ఉచిత ఇసుక విధానం లక్ష్యం ఎలా నెరవేరుతుందని చంద్రబాబు ప్రశ్నించారు. భవన నిర్మాణాల్లో ఇసుక భారం కాకూడదని ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకు వస్తే దానిని కొందరు నీరు గార్చే విధంగా ప్రయత్నించడమేమిటని నిలదీసినట్లు తెలిసింది. పేర్లు నేరుగా ప్రస్తావించకపోయినా ఎవరెవరు జోక్యం చేసుకుంటున్నారో తమ దృష్టికి వచ్చిందని, తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిసింది. ఉచిత ఇసుక విధానంలో నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం సహించబోదని చంద్రబాబు మరోసారి మంత్రులకు, అధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం.
Tags:    

Similar News