Tirumala : తిరుమలలో నేడు కూడా వేచి ఉండకుండానే స్వామివారి దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. గతంలో ఎంతగా లేనంతగా భక్తుల సంఖ్య తగ్గింది

Update: 2024-09-03 02:22 GMT

తిరుమలలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. గతంలో ఎంతగా లేనంతగా భక్తుల సంఖ్య తగ్గింది. సాధారణంగా మంగళవారం కావడంతో పాటు భారీ వర్షాలు కురుస్తుండటంతో తిరుమలకు భక్తులు చేరుకోలేకపోతున్నారు. రవాణా సౌకర్యాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒక్క విమానంలో తప్ప రైలు, రోడ్డు ప్రయాణాలకు ఆటంకంల కలుగుతుండటంతో భక్తులు తిరుమల సందర్శనను వాయిదా వేసుకున్నారు. దీంతో భక్తులు స్వల్ప సంఖ్యలో తిరుమల కొండపై కనిపిస్తున్నారు. నిన్న కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉన్నా ఎక్కువ మంది తిరుమలకు తిరుపతి చుట్టు పక్కల జిల్లాల నుంచి ప్రజలు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ ప్రభావం మరో రెండు రోజుల పాటు ఉండే అవకాశముందని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు నేరుగా స్వామి వారిని దర్శించుకునే వీలుంది.

హుండీ ఆదాయం మాత్రం...
అయితే భక్తుల సంఖ్య నిన్న తగ్గినప్పటికీ హుండీ ఆదాయం మాత్రం తగ్గకపోవడం విశేషం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.55 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు ఖాళీగానే ఉన్నాయి. భక్తులు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండకుండానే నేరుగా స్వామి వారి దర్శనం చేసుకునే వీలుంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు కూడా స్వామి వారి దర్శనం ఆరు గంటల్లో పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులుకు రెండు గంటల సమయంలో దర్శనం పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 63,936 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 18,697 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.


Tags:    

Similar News