Tirumala : పెరిగిన హుండీ ఆదాయం... ఏడుకొండలవాడి చెంతకు క్యూ కడుతున్న భక్తులు

తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరుగుతోంది. మంగళవారం అయినా భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది.

Update: 2024-07-02 03:10 GMT

తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరుగుతోంది. మంగళవారం అయినా భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. నిన్న కొంత భక్తుల సంఖ్య తగ్గినప్పటికీ ఈరోజు మాత్రం మళ్లీ భక్తుల సంఖ్య తిరుమలలో క్రమంగా పెరుగుతుందని అధికారులు తెలిపారు. గత కొద్దిరోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ అధికంగానే ఉంది. క్యూ లైన్లలో కూడా అధిక సంఖ్యలో భక్తులు ఉండటంతో శ్రీవారి సేవకులు అన్న ప్రసాదాలను కంపార్ట్‌మెంట్లలోనే అందిస్తున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

ఎనిమిది గంటలు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పది కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఈరోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటలకు పైగానే సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు నుంచి మళ్లీ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 75,449 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,121 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.91 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News