కిడ్నాపైన బాలుడి కథ సుఖాంతం.. మైసూర్ ఎత్తుకెళ్లిన మహిళ !

తల్లి స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలించారు. బాలుడి తండ్రి తిరుమలలోని

Update: 2022-05-05 04:19 GMT

తిరుపతి : తిరుమలలో మే 1వ తేదీ, ఆదివారం సాయంత్రం కిడ్నాపైన బాలుడికథ సుఖాంతమైంది. మతిస్థిమితం లేని మహిళ బాలుడిని మైసూర్ తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. తిరుమలలోని గొల్లమండపం సమీపంలో ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని మహిళ ఐదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసింది. కొడుకుకోసం వెతికిన తల్లికి ఎంతకూ ఆచూకీ తెలియకపోవడంతో.. సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తల్లి స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలించారు. బాలుడి తండ్రి తిరుమలలోని ఓ హోటల్ లో పనిచేస్తుండగా.. తల్లి శ్రీవారి ఆలయ సమీపంలో భక్తుల నుదుట గోవింద నామాలు పెడుతూ వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. ఆదివారం సాయంత్రం గొల్లమండపం సమీపంలో పింక్ చుడీదార్ వేసుకుని ఉన్న గుర్తుతెలియని మహిళ బాలుడి వద్దకు వచ్చి, స్వీట్లు తినిపించి తనతో తీసుకెళ్లినట్లు.. సీసీటీవీల్లో రికార్డైంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా.. ఆ మహిళ తిరుమల నుంచి నేరుగా మైసూరులోని తన ఇంటికి చేరుకుంది. బాలుడిని చూసిన తల్లిదండ్రులు ఆ చిన్నారి ఎవరని ప్రశ్నించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలుడిని వెంటబెట్టుకుని తిరుమలకు వచ్చి.. టిటిడి విజిలెన్స్ అధికారులకు బాలుడిని అప్పగించారు. తమ కుమార్తె పేరు పవిత్ర అని, ఆమెకు మతిస్థిమితం లేదని వారు తెలిపారు. టిటిడి విజిలెన్స్ అధికారుల వద్దకు చేరిన బాలుడిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పజెప్పారు.



Tags:    

Similar News