తిరుపతిలో హోటల్స్‌కు బాంబు బెదిరింపు

ఈరోజు తిరుపతి నగరంలోని కొన్ని హోటల్స్ కు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి

Update: 2024-10-26 04:37 GMT

తిరుపతిలో బాంబు బెదిరింపు కాల్స్ ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. ప్రధానమైన హోటల్స్ కు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తమవుతున్నారు. వెంటనే తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిన్న తిరుపతిలో ఐదు హోటల్స్ కు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. తనిఖీలు చేసి ఏమీ లేదని తేల్చారు.

ఈరోజు కూడా...
తాజాగా ఈరోజు తిరుపతి నగరంలోని అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్ హోటల్ , వైస్రాయ్ ఇంకా రెండు ప్రాంతాలలో బాంబులు పెట్టినట్టు సమాచారం రావడంతో హోటల్లో అలిపిరి సీఐ బాంబ్ స్కోడ్ తనిఖీలు నిర్వహించారు. బాంబ్ స్క్కాడ్ తో తనిఖీలను నిర్వహించారు. హోటల్స్ లో కస్టమర్లను బయటకు పంపి తనిఖీలు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News