న్యాయ విచారణ జరపాల్సిందే.. బాబు లేఖ

వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై ఖచ్చితంగా న్యాయవిచారణ జరపాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.

Update: 2021-11-28 06:31 GMT

వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై ఖచ్చితంగా న్యాయవిచారణ జరపాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈమేరకు చంద్రబాబు చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమ ే 6,054 కోట్ల నష్టం వాటిల్లితే, కేవలం ఇప్పటి వరకూ 35 కోట్ల నిధులను మాత్రమే విడుదల చేయడమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రకృతి వైపరిత్యాల కోసం ఖర్చు చేయాల్సిన 1100 కోట్ల నిధులను ఇతర పథకాలకు మళ్లించడాన్ని కాగ్ తప్పపట్టిన విషయాన్ని చంద్రబాబు ఈ లేఖలో గుర్తు చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తుందన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని చంద్రబాబు లేఖలో అభిప్రాయపడ్డారు. తుమ్మల చెరువు ప్రాంతాన్ని ఆటస్థలంగా మార్చడం వల్లే ఈ విపత్తు సంభవించిందన్నారు. తుపాను, వరద తగ్గినా సహాయ కార్యక్రమాలను బాధితులకు అందించడంలో ప్రభుత్వం వైఫ్యలం చెందిందని, దీనిపై న్యాయ విచారణ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.


Tags:    

Similar News