Tirumala : లడ్డూ వివాదం నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల లడ్డూలో కల్తీ జరిగినందున టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలని నిర్ణయించింది

Update: 2024-09-21 12:06 GMT

tirumala tirupathi devasthanam

తిరుమల లడ్డూలో కల్తీ జరిగినందున టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలని నిర్ణయించింది. త్వాత తొలుత మహా శాంతియాగాన్ని నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. టీటీడీ నిర్ణయించిన మేరకు మూడు రోజుల పాటు శాంతి యాగాన్ని నిర్వహించనున్నారు.

మహా శాంతి యాగం...
మహా శాంతి యాగం ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ నిర్వహించనున్నారు శ్రీ వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తొలుత తిరుమల తిరుపతి దేవస్థానంలో సంప్రోక్షణ నిర్వహించి తర్వాత మహా శాంతి యాగాన్ని నిర్వహించనున్నారు.


Tags:    

Similar News